March 2026 Current Affairs MCQs Telugu for APPSC TSPSC SSC Railway Exams, మార్చి 2026 కరెంట్ అఫైర్స్ MCQs తెలుగులో daily updated MCQ Test.
March 20th 2026 Current Affairs MCQs
ఈ పోస్ట్లో మార్చి20 2026కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ MCQs తెలుగులో ఇవ్వబడ్డాయి. ఇవి APPSC, TSPSC, SSC వంటి పోటీ పరీక్షలకు చాలా ఉపయోగపడతాయి.
✔ మొత్తం ప్రశ్నలు: 20
✔ పరీక్షలకు ఉపయోగం: APPSC, TSPSC, SSC
✔ ముఖ్య అంశాలు: అవార్డులు, నియామకాలు, రిపోర్టులు
క్విజ్ స్టార్ట్ బటన్ ప్రెస్ అవ్వకపోతే దయచేసి ఒకసారి పేజీ ని రిఫ్రెష్ చేయండి.
March 20th 2026 Current Affairs Quiz
మార్చి 2026 కరెంట్ అఫైర్స్ MCQs
March 20th Current Affairs Quiz
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) నూతన అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు?
A) హంసరాజ్ అహిర్
B) సాధ్వి నిరంజన్ జ్యోతి
C) నిధి చిబ్బర్
D) సబా షాల్
జవాబు: B సాధ్వి నిరంజన్ జ్యోతి
వివరణ: మాజీ కేంద్ర మంత్రి మరియు బిజెపి నాయకురాలు సాధ్వి నిరంజన్ జ్యోతిని NCBC అధ్యక్షురాలిగా రాష్ట్రపతి నియమించారు. ఈమె హంసరాజ్ అహిర్ స్థానంలో బాధ్యతలు చేపట్టారు.
‘ప్రపంచ సంతోష సూచిక 2026’ (World Happiness Index)లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది?
A) 118వ స్థానం
B) 126వ స్థానం
C) 116వ స్థానం
D) 102వ స్థానం
జవాబు: C) 116వ స్థానం
వివరణ: మొత్తం 147 దేశాల జాబితాలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. గతేడాది 118వ ర్యాంకులో ఉండగా, ఈసారి రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది.
దేశవ్యాప్తంగా 100 ‘ప్లగ్ అండ్ ప్లే’ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఆమోదించిన పథకం ఏది?
A) అమృత్ పథకం
B) సమర్థ్ పథకం
C) భవ్య (BHAVYA) పథకం
D) ఉదయ్ పథకం
జవాబు: C) భవ్య (BHAVYA) పథకం
వివరణ: ‘భారత్ పారిశ్రామిక వికాస యోజన’ (BHAVYA) పథకం కింద ₹33,600 కోట్ల బడ్జెట్తో దేశవ్యాప్తంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామిక పార్కులను నిర్మిస్తారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సహకారంతో పాఠశాల విద్యను మెరుగుపరచడానికి ‘సిఖియా క్రాంతి 2.0’ను ప్రారంభించింది?
A) హర్యానా
B) పంజాబ్
C) ఉత్తరప్రదేశ్
D) గుజరాత్
జవాబు: B) పంజాబ్
వివరణ: పంజాబ్ ప్రభుత్వం ₹3500 కోట్లతో (ప్రపంచ బ్యాంక్ ₹2500 కోట్ల రుణంతో) పాఠశాల విద్యను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి ఈ ప్రాజెక్టును చేపట్టింది.
దత్తత తీసుకున్న తల్లులకు (Adoptive Mothers) ఎన్ని వారాల ప్రసూతి సెలవు (Maternity Leave) ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది?
A) 6 వారాలు
B) 12 వారాలు
C) 26 వారాలు
D) 8 వారాలు
జవాబు: B 12 వారాలు
వివరణ: దత్తత తీసుకునే పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా, దత్తత తీసుకున్న తల్లులందరికీ 12 వారాల ప్రసూతి సెలవు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇటీవల ‘నావిక్’ (NavIC) వ్యవస్థకు చెందిన ఏ ఉపగ్రహంలో పరమాణు గడియారం (Atomic Clock) విఫలమైంది?
A) IRNSS-1A
B) IRNSS-1F
C) NVS-01
D) IRNSS-1G
జవాబు: B IRNSS-1F
వివరణ: నావిక్ వ్యవస్థలో భాగంగా ఉన్న IRNSS-1F ఉపగ్రహంలోని రుబీడియం అటామిక్ క్లాక్ పనిచేయకపోవడం వల్ల పొజిషనింగ్ డేటా కచ్చితత్వంపై ప్రభావం పడింది.
గుజరాత్ తన మొదటి సౌండింగ్ రాకెట్ను (Sounding Rocket) ఎక్కడ నుండి విజయవంతంగా ప్రయోగించింది?
A) శ్రీహరికోట
B) పోఖ్రాన్
C) చండీపూర్
D) ధోలేరా
జవాబు: D) ధోలేరా
వివరణ: అహ్మదాబాద్కు చెందిన ‘ఓం స్పేస్’ స్టార్టప్ రూపొందించిన ఈ సబ్-ఆర్బిటల్ రాకెట్ను ధోలేరాలోని బావలి నుండి ప్రయోగించారు.
‘ది గోల్డెన్ రోడ్’ (The Golden Road) పుస్తకానికి గాను 2026 మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరు?
A) నవతేజ్ సర్నా
B) విలియం డాల్రింపుల్
C) అమితావ్ ఘోష్
D) సల్మాన్ రష్దీ
జవాబు: B విలియం డాల్రింపుల్
వివరణ: ప్రముఖ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ తన చారిత్రక రచన ‘ది గోల్డెన్ రోడ్’ కోసం ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందారు.
ఇటీవల భువనేశ్వర్లో ‘కిస్ (KISS) హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025’ అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు?
A) సుధా మూర్తి
B) నీతా అంబానీ
C) కిరణ్ మజుందార్ షా
D) ఆనంద్ మహీంద్రా
జవాబు: B
వివరణ: రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీకి ఆమె చేసిన సామాజిక మరియు మానవతా సేవలకు గాను ఈ అవార్డును ప్రధానం చేశారు.
సముద్రంపై గాలి వేగాన్ని కొలవడానికి భారత్ స్వదేశీ ‘ఫ్లోటింగ్ లిడార్ బాయ్ సిస్టమ్’ను ఎక్కడ పరీక్షించింది?
A) విశాఖపట్నం
B) ముత్తం తీరం (తమిళనాడు)
C) కొచ్చి
D) పనాజీ
జవాబు: B వి
వరణ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను తమిళనాడులోని ముత్తం తీరంలో విజయవంతంగా పరీక్షించారు.
దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) తెలంగాణ
B) ఒడిశా
C) కర్ణాటక
D) ఆంధ్రప్రదేశ్
జవాబు: D) ఆంధ్రప్రదేశ్
వివరణ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద దివ్యాంగులతో పాటు వారి సహాయకులకు కూడా 50% రాయితీ లభిస్తుంది.
ఒడిశా రాష్ట్రంలోని మొదటి ‘స్మార్ట్ విలేజ్’గా ఏ గ్రామం రికార్డు సృష్టించింది?
A) సతనావరి
B) పిపాలి
C) కుసున్పూర్
D) కోణార్క్
జవాబు: C కుసున్పూర్
వివరణ: కేంద్రపారా జిల్లాలోని కుసున్పూర్ గ్రామం ఆధునిక సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలతో ఒడిశాలో తొలి స్మార్ట్ విలేజ్గా అవతరించింది.
నేపాల్ దేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళా పార్లమెంటు సభ్యురాలు (MP) ఎవరు?
A) భూమికా శ్రేష్ఠ
B) లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి
C) జోయిటా మండల్
D) పద్మ అయ్యర్
జవాబు: A భూమికా శ్రేష్ఠ
వివరణ: భూమికా శ్రేష్ఠ నేపాల్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్ మహిళగా చరిత్ర సృష్టించారు.
భారతదేశం ఏ దేశంతో కలిసి ప్రపంచ ప్రసిద్ధ ‘పరంబనన్’ (Prambanan) హిందూ దేవాలయ కాంప్లెక్స్ను పునరుద్ధరించనుంది?
A) కంబోడియా
B) ఇండోనేషియా
C) థాయిలాండ్
D) వియత్నాం
జవాబు: B ఇండోనేషియా
వివరణ: ఇండోనేషియాలోని జావాలో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం పరంబనన్ను పునరుద్ధరించడానికి భారత్ మరియు ఇండోనేషియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
ప్రతి ఏటా మార్చి 20న జరుపుకునే ముఖ్యమైన దినోత్సవాలు ఏవి?
A) అంతర్జాతీయ సంతోష దినోత్సవం
B) ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
C) ప్రపంచ జల దినోత్సవం
D) A మరియు B రెండూ
జవాబు: D A మరియు B రెండూ
వివరణ: మార్చి 20న అటు సంతోష దినోత్సవం (International Day of Happiness), ఇటు పిచ్చుకల దినోత్సవం (World Sparrow Day) రెండూ జరుపుకుంటారు.
బ్యాంకాక్లో జరిగిన ‘వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026’ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎంత?
A) మొదటి స్థానం
B) రెండవ స్థానం
C) నాల్గవ స్థానం
D) ఐదవ స్థానం
జవాబు: C నాల్గవ స్థానం
వివరణ: ఒక స్వర్ణం, మూడు రజతాలు మరియు ఒక కాంస్యంతో భారత్ మొత్తం ఐదు పతకాలు సాధించి నాల్గవ స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్థాన్ మొదటి స్థానంలో ఉంది.
Latest Test Series
Discover more from SRMTUTORS
Subscribe to get the latest posts sent to your email.









